Thursday, February 3, 2011

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం 

: ముగ్గురు మృతి

విజయనగరం, ఫిబ్రవరి 3 : విజయనగరం జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని జామి మండలం, ఆలమంద సమీపంలో చోటుచేసుకుంది.

వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment