Monday, February 14, 2011
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఉత్సవాలు
రంగ రంగ వైభవంగా
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి
ఉత్సవాలు
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి రధోత్సవం సోమవారం బీష్మఏకాదశి పర్వదినాన కనుల పండుగగా జరిగింది.స్వామీ వారిని అమ్మ వార్లను పెళ్లి అలంకరణలతో రధం పై అలంకరించి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. తన సోదరి గుర్రలక్క గుడి వద్దకు ఈ యాత్ర సాగింది. అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరిగాయి.లక్షలాధి సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.గోవింద నామ స్మరణతో అంతర్వేది పరవశించింది .రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ , జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ వేణుగోపాల్, ఆలయ చైర్మెన్ రాజ బహద్దూర్ , కార్య నిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు.
స్వామివారికి పూజలు చేస్తున్న మహిళా భక్తులు
ఏనుగు వాహనపై ఊరేగే
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారలు.
కనులవిందుగా
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి రధోత్సవం
స్వామి వార్లను దర్శించుకోనేందుకు క్యులైన్లలో భక్తులు
ఉత్సవాలను తిలకించేందుకు
జాగరణ చేస్తున్న భక్తులు.
స్వామివారి ఉత్సవం కోసం ఎదురు చూస్తున్న
వేలాది మంది భక్తులు.
Subscribe to:
Posts (Atom)